గద్వాల్: పాలమూరు విద్యార్థి మృతిపై స్పందించిన:మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ
అమెరికాలో పాలమూరు విద్యార్థి మృతిపై శనివారం మహాబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించారు. నిజాముద్దీన్ విషయం బాధ కలిగించిందని, ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడినట్లు తెలిపారు. మృతదేహాన్ని పాలమూరుకు తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తా అన్నారు. ఇప్పటికే ఈ విషయమైన భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. ఎక్సటర్నల్ ఎఫైర్స్ కమిటీకి లేఖ రాశానని అన్నారు.