ఒంగోలు అర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Aug 17, 2026
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఈనెల 23వ తేదీన పంతులు గారి జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణపై సోమవారం గ్రీవెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనంలోనూ, వినోద రాయునిపాలెం, దేవరంపాడులో కూడా ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఆహ్వాన పత్రాల అందజేత, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రోటోకాల్ విషయాలలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు