దర్శి: ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో ఉపాధ్యాయుడికి టోకరా వేసిన సైబర్ మోసగాళ్లు
Darsi, Prakasam | Apr 27, 2025 ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయి ఆదివారం ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సదరు ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. కుమారుని చదువు కోసం బ్యాంకులో దాచుకున్న 5 లక్షల 18 వేల రూపాయల నగదు తనకు తెలియకుండా బ్యాంకు ఖాతాలో నుంచి మాయమైపోయిందని ఈ విషయంపై బ్యాంక్ అధికారులను సంప్రదించిన వారు పట్టించుకోకపోవటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.