నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, అప్పారావుపాలెం గ్రామ సమీపంలోని పెన్నానది ఆరుగురు పశువుల కాపర్లు నదిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రెస్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, ఫైర్ సిబ్బంది వారిని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి సీఐ గంగాధర్ మాట్లాడుతూ.. పెన్నా నది వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద సమయంలో పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.