నాగలాపురం కాలేజీలో టాయిలెట్లు లేక అవస్థలు నాగలాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులు, ఏడుగురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. గత ప్రభుత్వం 'నాడు-నేడు' ద్వారా కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లులు ఆలస్యమైందన్న కారణంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేసినట్లు ప్రిన్సిపాల్ లత తెలిపారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం చొరవ తీసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.