గంగవరం: మండల పోలీసు వర్గాలు మీడియా తెలిపిన సమాచారం మేరకు. చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిపై నంగిలి టోల్ గేట్ వద్ద లారీ బోల్తా కొట్టింది. మెషినరీ మెటీరియల్ లోడ్తో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలు ఎంతమేర నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామన్నారు.