గుత్తి మండలం బసినేపల్లి తాండా శివారులో శుక్రవారం సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో ఎస్ఐలు సురేష్, అమీర్ ఖాన్, ఏఎస్ఐ నాగమణిక్యం తదితరులు పాల్గొన్నారు.