ఒంగోలు అర్బన్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమం ను నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 17, 2026
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు. 59 అర్జీలు నమోదు అయ్యాయి. తన పరిధిలో ఉన్న వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ లో నమోదైన అర్జీలు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్నారు. బాధితులకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.