సంతనూతలపాడు: పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం: చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య
చీమకుర్తి: పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటామని , వ్యాధులు దరి చేరవని చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో చెత్త, వ్యర్ధాలను పరిశుద్ధ సిబ్బంది మరియు స్థానిక నాయకులు , కమిషనర్ తొలగింప చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రామకృష్ణయ్య మాట్లాడుతూ.... మన ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.