జగ్గంపేట: తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు
గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి టీటీడీ రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో ఈ నిధులు వచ్చినట్లు చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర తెలిపారు. అలాగే రూ.30 లక్షల విరాళం ప్రకటించిన డి. సీతారాంను అభినందించారు.