శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని తాడిమర్రి మండలం నాయన పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ విద్యుత్ షాక్కు గురై నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. బుధవారం తన ఇంటి పైకప్పు పై బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.