గుంతకల్లు: కార్పొరేట్ పాఠశాలలు వద్దు... ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, గుత్తిలో పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు
పదవ తరగతి ఉత్తీర్ణత అనంతరం విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో చేరకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని ఎస్ఎఫ్ఐ గుత్తి మండల కార్యదర్శి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్పోరేట్ కళాశాల వద్దు ప్రభుత్వ కళాశాల ముద్దు అనే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేటు కళాశాలలో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు.