జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ… జిల్లాలోని D.Ed./B.Ed. పూర్తి చేసిన చాత్రోపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంచి అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 48 పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపాదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి సంచాలకులు అనుమతి జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ పోస్టులు పూర్తిగా 5 నెలలపాటు మాత్రమే కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయబడతాయని ఆయన తెలిపారు. విద్యాసంస్థల్లో ఉన్న ఉపాధ్యాయ లోటును భర్తీ చేసి విద్యార్థుల విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.