నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద పెరుగుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 23,842 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 74.863 TMCల నీటిమట్టం నమోదైంది. పెన్నా డెల్టాకు 27, 300 క్యూసెక్కులు, కండలేరుకు 2000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.