మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త అంజయ్య ను భార్య కొడుకు, అల్లుడు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువెతాయి. మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తున్నాడని హత్య జరిగినట్లు మృతుడి పెద్ద కుమారుడు ఉదయ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.