ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలలో బీచ్ ఫెస్టివల్ ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు ఫుడ్ స్టాల్స్, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేందుకు ప్రముఖ యాంకర్ సుమ హాజరవుతున్నట్లు ఏపీ టూరిజం శాఖ అధికారులు ఓ ప్రార్ధనలు తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసేందుకు అధికారులు కార్యచరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.