కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదార్ పాసు పుస్తకాలను అందిస్తోందని మంత్రి స్వామి అన్నారు. మారిటైం బోర్డు ఛైర్మన్ సత్యతో కలిసి సింగరాయకొండ మండలంలోని శానంపూడిలో నిర్వహించిన పట్టాదార్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 300 మంది లబ్ధిదారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. QR కోడ్ స్కాన్ చేస్తే పొలం సరిహద్దులు, వివరాలు వస్తాయన్నారు.