ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మర్రిపూడి పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ శనివారం తెలిపారు. రాంబాబుపై ఇటీవల మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రేగుల వీరనారాయణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చేరెడ్డి నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు.