కర్నూలు: నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన జిల్లా పోలీసులు
జిల్లాలో నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగినవారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.పోలీసు అధికారులు నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని వారికి సూచించారు. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా కొత్త జీవితం ప్రారంభించాలని హితవు పలికారు."నేర ప్రవృత్తిని విడనాడకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు" అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు హెచ్చరించారు.