గుంతకల్లు: గుత్తిలో సిలిండర్లు పంపిణీ చేయలేదని ఆందోళన, గ్యాస్ ఏజెన్సీ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదం
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీలో జాప్యంపై వినియోగదారులు ఆందోళనకు దిగి ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని మదీనా భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం సిలిండర్ల కోసం వందలాది మంది చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్లను వరుసగా పెట్టీ గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయం నుంచి వేచి ఉన్న గ్యాస్ ఇవ్వకుండా సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. గ్యాస్ వస్తుంది ఇస్తామని వేచి ఉండాలని వినియోగదారులను సిబ్బంది ఎర్రటి ఎండలో గంటల పాటు నిలబెట్టారు. క్యూ లైన్ లలో నిరీక్షించి ఓపిక నశించిన కొందరు ఘర్షణకు దిగారు