ఒంగోలు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం అలజడి నెలకొంది. ఏసీబీ అధికారుల దాడులతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించిన సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి బయటకు కొంత నగదును విసిరి వేశాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడంతో పాటు బాత్రూంలో దాచిపెట్టిన మరో రూ.10వేలు, మొత్తం రూ.30 వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకొని రికార్డులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ సీఐ తెలిపారు.