వికారాబాద్: దారుర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన అదనపు కలెక్టర్ లింగ్య నాయక్
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9 వరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా దారుర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని శనివారం అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ పరిశీలించారు. తహసీల్దార్, సిబ్బందికి పలు సూచనలు చేశారు.