వికారాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్
నవాబుపేట్ మండలం తిమ్మారెడ్డిపల్లి గేటు వద్ద తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుడు మహేందర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, సహచర తెలంగాణ ఉద్యమకారులు, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సాధన సమయంలో అలుపెరుగని పోరాటం చేసిన మహేందర్ రెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకమని, ఎన్నో కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడిన మహేందర్రెడ్డి రాష్ట్రం ఏర్పాటు తర్వాత లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.