రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ పరంపరలో, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల రైతు సేవా కేంద్రం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా రైతులతో మాట్లాడగా,అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం గొర్లముదివేడు రైతు సేవా కేంద్రం నుండి రాష్ట్ర రవాణా, యువజన–క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పంచ సూత్రాలు– నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప