గుంతకల్లు: గుత్తి మండలం పూలకుంట శివారులో భార్యను హత్య చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట శివారులో మూతబడిన కంకర క్రషర్ వద్ద భార్య కోటేలి లక్ష్మిని హత్య చేసిన భర్త శివలింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన కోటేలి లక్ష్మిని భర్త శివలింగయ్య పూలకుంట శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మంగళవారం హత్య చేశాడు. అయితే బంధువులు, కుమార్తెలు తల్లి మృతి చెందిందని ఆర్తనాదాలు చేస్తూ రోదిస్తున్న సమయంలో లక్ష్మిని హత్య చేసిన భర్త శివలింగయ్య పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు కారణమైన శివలింగయ్య కోసం ఆరా తీయగా అతడు లేకపోవడంతో గాలించి పట్టుకున్నారు.