జనగాం: స్వచ్ఛతయే మన నినాదం- ఆరోగ్యమే అన్నింటికన్నా ప్రధానం: జిల్లా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్
సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ -2025 పక్షోత్సవాలలో భాగంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ బచ్చన్నపేట ప్రధాన కూడలిలో విద్యార్థులు,మహిళా సంఘ సభ్యుల,గ్రామ ప్రజలచేత మానవహారం,ర్యాలీ,స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించి తదనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారు 600 మంది తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతయే మన నినాదం - ఆరోగ్యమే అన్నింటికన్నా ప్రధానం అన్నారు.