పలమనేరు: ఆర్టీసీ డిపో నందు ఏపిపిటిడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం
పలమనేరు: ఆర్టీసీ డిపోలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు జగన్నాథం తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటిడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తి వీటిని యాజమాన్యం అటు ప్రభుత్వము తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఏపీపీటిడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విపులంగా వివరించి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగన్నాథం, పలమనేరు డిపో కార్యదర్శి నూర్ భాషా, మరియు బాలకృష్ణ కండక్టర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.