కనిగిరి: నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి తెలిపారు. మర్రిపూడి నుండి కనిగిరి మండలం పునుగోడు వరకు సాగర్ మంచినీటి పైప్ లైన్ల ఆధునికీకరణ, నూతన పంపుసెట్ల ను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గం లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా వారికి మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే మంచినీటి పైప్ లైన్ల ఆధునీకీకరణ, నూతన పంపుసెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.