ఒంగోలు అర్బన్: కండరాల పెరుగుదల వ్యాధి బాలుని కుటుంబానికి కలెక్టర్ రాజాబాబు భరోసా
Ongole Urban, Prakasam | Aug 17, 2026
అరుదైన కండరాల అసాధారణ పెరుగుదల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో వీల్ చైర్ కు పరిమితమైన ఆ బాలుడిని చూసి జిల్లా కలెక్టర్ రాజాబాబు చలించిపోయారు. బాలుని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సంతమాగులూరు మండలం కొప్పెరం గ్రామం నుంచి సహాయం కోసం సోమవారం కలెక్టరేట్లో ' మీకోసం ' కార్యక్రమానికి వచ్చిన ఆ బాలుని పేరు వల్లెపు పవన్ కిషోర్. వయస్సు 11 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులోనే ఈ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అసాధారణ స్థాయిలో వయసుకు మించి కండరాలు పెరుగుతున్నాయని తెలిపారు