నరసరావుపేట: పల్నాడులో ట్రాక్టర్పై నుంచి పడి ఐదేళ్ల చిన్నారి మృతి
పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం నార్నేపాడుకి చెందిన కొండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి కింద పడి కన్ను మూసింది.ఆదివారం తొలి ఏకాదశి పండుగ నాడు పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నరసరావుపేటలోని పాఠశాలలో పాప చదువుతోంది. గ్రామంలో గాయపడిన పాప చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో మరణించింది.పాప మృతితో కటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.