బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలపై దృష్టి సారించాలని, వ్యవసాయం ఉద్యానవన పంటలు మరియు పశుసంవర్ధక రుణాలను ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ బ్యాంకులు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎల్డిఎం ఆంజనేయులు ప్రారంభిస్తూ.... జిల్లాలోని బ్యాంకుల రుణాల మంజూరు ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలు ప్రాధాన్యత రంగాలకు ఇవ్వ