NTR, మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కృషితోనే తెలుగుగంగ కాలువ నిర్మాణం సాధ్యమైందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. వెంకటగిరి మండలం ఊట్లపల్లి వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేశారు. కార్యక్రమంలో వెంకటగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, విజయశ్రీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.