రాప్తాడు: శిల్పారామం వద్ద రంజాన్ పండుగ అనంతరం వేలాది ముస్లిం కుటుంబాలు శిల్పారామం కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమందడి వద్ద ఉన్న శిల్పారామంలో ఆదివారం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని వేలాది ముస్లిం కుటుంబాలు విహారయాత్రకు తరలిరావడంతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ రంజాన్ పండుగ అనంతరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోటకు వెళ్తారని ఈ సందర్భంలోనే తామంతా శిల్పారామం వద్దకు రావడం జరిగిందని శిల్పారామంలో అల్లాదకరమైన వాతావరణం పచ్చని మొక్కలు ఉండడంతో ఇక్కడికి రావడం జరిగిందని మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తే సందర్శించిన కూడా ఎక్కువగా వస్తారని పలువురు ముస్లింలు పేర్కొన్నారు.