ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని గోగినేని వారిపాలెం గ్రామానికి చెందిన మధు కిరణ్ (15) ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బంధువుల ఇళ్లల్లో పాటు సమీప ప్రాంతాలు అన్వేషించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎవరన్నా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే 8500244240 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.