వికారాబాద్: వికారాబాద్ జిల్లా బైండ్ల సంఘం అధ్యక్షునిగా లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే కమిటీ నిలయంలో రాష్ట్ర బైండ్ల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా బైండ్ల సంఘం అధ్యక్షులుగా లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షుడు రామ్ చందర్, ఉపాధ్యక్షులు రాములు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.