తురకై అంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్న గూడా లక్ష్మీ మెగా టౌన్షిప్ లో శ్రీ కోదండ రామచంద్ర మౌలిశ్వర స్వామి దేవాలయాల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.