పవిత్రమైన సంకల్పంతో మన రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని కృత నిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కృష్ణానది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే మనకు శక్తిని ఇస్తుందన్నారు దేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదో అదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు శ్రీవారికి అప్రతిష్ట పాలు చేసే ఏ పనిని చేయనని శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలన్నారు.