దర్శి: మారెళ్ళలో ఉపాధి హామీ కార్మికులకు వీబీ జీ రామ్ జి చట్టంపై అవగాహన కల్పించిన టి ఏ శివరామకృష్ణ
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళలో ఉపాధి హామీ కార్మికులకు వి బి జి రామ్ జి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఏ శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రతికూలికి సంవత్సరానికి 125 రోజులు పని హామీ కల్పిస్తున్నట్లు తెలిపారు. రోజువారీగా 311 రూపాయలు వేతన అందుతుందని కార్మికుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.