రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని సూచనల మేరకు సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారు రాజంపేట మరియు బద్వేల్ సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్ లను విజిట్ చేయడం జరిగినది. రిజిస్టర్లను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ప్రాధాన్యతను తెలియజేశారు, జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమును వివరించారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.