సత్తెనపల్లె: నకరికల్లు మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు
పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలోని అద్దంకి మరియు నార్కెట్పల్లి హైవేపై ఆదివారం సాయంత్రం 6:00 సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును వేగంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.