కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య కు జన నీరాజనం, కార్లు, బైక్ ల ర్యాలీలతో హోరెత్తించారు
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ చేయించాడని మాజీ ఎంపీ తలారి రంగయ్య కు కళ్యాణదుర్గంలో సోమవారం ఘన స్వాగతం లభించింది. జనాలు నీరాజనం పలికారు. కార్లు, బైక్ ర్యాలీ లు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య కారు టాప్ పై నిలుచుని అందరికీ అభివాదం చేశారు. అన్ని వర్గాలు ప్రజలతోపాటు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జనాలతో కళ్యాణదుర్గం వీధులు నిండిపోయాయి.