డ్రైవర్లు, విద్యార్థులు అగ్ని ప్రమాదాల పై అవగాహన కలిగి ఉండాలని పీలేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.విజయ్ కుమారి తెలిపారు. బుధవారం పీలేరు ఎంవీఐ కార్యాలయం లో వివిధ పాఠశాలల డ్రైవర్లతో, అదేవిధంగా ఎంజెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్ధులతో విడి విడిగా మోటార్ వాహన తనిఖీ అధికారి టి.విజయ్ కుమారి అగ్ని భద్రత ప్రమానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన తొలి జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ మార్గాలు, రవాణా భద్రత ప్రమాణాలపై వివరించారు.