కొండపి: కొండపి మండలం జాల్లపాలెం లో చోరీకి పాల్పడ్డ దొంగని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెంలో ఈనెల 7వ తేదీన జరిగిన చోరీ ఘటనను పోలీసులు చేదించారు. గ్రామంలోని రామలక్ష్మమ్మ కు చెందిన ఇంటిలో బీరువా పగలగొట్టి 9 సవర్ల బంగారాన్ని దొంగ అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దొంగను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి సత్యనారాయణ వెల్లడించారు. చోరీ చేసిన బంగారాన్ని తిరిగి రికవరీ చేశామని డిఎస్పి తెలిపారు.