కమలాపురం: వల్లూరు: సీఐ రేషన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలం వల్లూరు సమీపంలో మంగళవారం సాయంత్రం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సిఐ రోషన్, ఎస్సై పెద్ద ఓబన్న ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్బంగా వాహనాలను తనిఖీ చేసి, సరైన ధ్రువ పత్రాలు, రికార్డులు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిఐ రోషన్ మాట్లాడుతూ సరైన వాహన ధ్రువీకరణ పత్రాలతో ప్రయాణం చేయాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.