దంతాలపల్లి: పెద్ద ముప్పారంలో కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్ద ముప్పారానికి చెందిన సంపత్(30) ఈనెల 21న తేదిన గడ్డి మందు తాగాడు. దీంతో గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజీఎంకుతరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.