మార్కాపురం: తుమ్మలచెరువు గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని కాసిం స్వామి దర్గాలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, హార్టికల్చర్ హాబ్ తో నిధులు మంజూరు అవుతున్న నేపథ్యంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు