మహబూబ్ నగర్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జిల్లా లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు