ప్రతాపసింగారంలో కంట మహేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు గురువారం కూల్చివేయడంతో హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ స్థలంలో ఉందని గుడి కూల్ చేస్తారా అని హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. నిరసనగా శుక్రవారం ఉదయం 9:30 కు ప్రతాప శృంగారం డబుల్ బెడ్ రూమ్ వద్ద భారీ ఆందోళనకు బీజేవైఎం, గో రక్షక్ దళ్, హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. హిందూ బంధువులంతా భారీగా హాజరై తమ గలాన్ని వినిపించాలని కోరాయి.