మంత్రాలయం: ఈనెల 19,20 తేదీలలో ఆదరణలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళన సదస్సును జయప్రదం చేయండి: పెద్ద కడబూరు రైతు సంఘం పిలుపు
పెద్ద కడబూరు:రేతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మబ్బు అంజనేయ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్ద కడబూరు లో సీపీఐ ఆఫీసు వద్ద సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 19, 20వ తేదీలలో ఆదోనిలో జరిగిన రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనం సదస్సు జయప్రదం చేయాలని కోరారు. అధిక వర్షాల మూలంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.