APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 14 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 720 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.